నాట్స్ వేడుకల్లో టీవీ 5 యాజమాన్యం ఆధ్వర్యంలో వస్తున్న హిందూ ధర్మం ఛానల్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన పలువురు హిందూ ధర్మ ప్రచారాన్ని ఈ ఛానల్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నాట్స్ సభ్యులు ఈ సందర్భంగా టీవీ 5 సిఇఓ శ్రీధర్ చిల్లరను ఘనంగా సన్మానించారు.