దిశ కేసులో నిందితులకు ఉరి శిక్ష వేయాలని ఏఐఏడీఎంకే ఎంపీ విజిల సత్యనాథ్ రాజ్యసభలో డిమాండ్ చేశారు. తక్షణం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాలు చేసి నిందితులకు శిక్ష వేయాలని కోరారు. ఈ నెల 31లోపు ఆ నలుగురిని ఉరితీయాలన్నారు. అత్యాచార కేసుల్లో న్యాయం ఆలస్యమయ్యే కొద్దీ నిరాకరించబడుతుందని వ్యాఖ్యానించారు.