రక్షణ మంత్రి కీలక ప్రకటన .. దీనిపై ఆందోళన అవసరం లేదు

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాగా పలు చోట్ల నిరసనలు, హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ ఆందోళనలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. అగ్నివీరుల భవిష్యత్కు ఢోకా లేదు. గరిష్ట వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నాం. రేండేళ్లుగా ఆర్మీ రిక్రూట్మెంట్స్ జరుగనందునే ఈ మినహాయింపు ఇస్తున్నాము. యువతను రక్షణ రంగంలోకి తీసుకెల్లే అద్భుత పథకం అగ్నిపథ్. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత మాతకు సేవ చేసేందుకు ఇదో సువర్ణ అవకాశం ఈ అవకాశాన్ని యువత ఉపయోగించుకోవాలి అని సూచించారు.
Tags :