ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రపంచంతో పోటీపడేలా పిల్లలను సన్నద్ధం చేసేందుకు ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ బైజూస్తో ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందంపై ప్రభుత్వ అధికారులు, బైజూస్ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ బైజూస్తో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని వెల్లడిరచారు. ఈ ఒప్పందంతో ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 10వ తరగతి వరకు ఎడ్యు`టెక్ విద్యను అందించనున్నట్లు తెలిపారు.
బైజూస్ ద్వారా పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా పాఠ్యాంశాల రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. వీటితో విద్యార్థులు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో సమగ్రంగా నేర్చుకునేందుకు వీలుంటుందన్నారు. ఏటా 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వన్నట్లు తెలిపారు. ఈ సెప్టెంబరులోనే విద్యార్థులకు ట్యాబ్లు అందిస్తామన్నారు. వీడియో కంటెంట్ ద్వారా పాఠ్యాంశాలను అర్థం చేసుకునేలా తరగతి గతిలో టీవీలూ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, ఐ అండ్ పీఆర్ కమిషనర్ టి విజయకుమార్ రెడ్డి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎంవీ శేషగిరిబాబు, ఎస్ఎస్ఏ ఎస్పీడీ వెట్రిసెల్వి, బైజూస్ వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ) సుస్మిత్ సర్కార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.