ఆటా కాన్ఫరెన్స్లో వివాహ పరిచయ వేదిక

వాషింగ్టన్ డీసిలో జరగనున్న ఆటా మహాసభల్లో తెలుగు యువతీ యువకులకోసం ప్రత్యేకంగా వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు, అబ్బాయిలు తమ పేర్లను రిజిష్టర్ చేసుకుంటే వారిని ఈ మేట్రిమోనియల్ వేదికపై తీసుకెళ్ళి వివాహ సంబంధాలు నిశ్చయం చేసుకునేందుకు అవకాశాన్ని కలగజేయనున్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుకున్నారు.
అనిత ముతోజు దీనికి చైర్గా వ్యవహరిస్తున్నారు. సాయి వల్లూరిపల్లి, సుదర్శన్ రెడ్డి అరువ, కోటిరెడ్డి దీనికి కో చైర్లుగా ఉన్నారు.
Tags :