MKOne TeluguTimes-Youtube-Channel

గన్ పార్కు వద్ద ఉద్రిక్తత.. బండి సంజయ్, ఈటలను

గన్ పార్కు వద్ద ఉద్రిక్తత.. బండి సంజయ్, ఈటలను

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) పేపర్‌  లీకేజీ అంశంపై గన్‌పార్కు అమరవీరుల స్థూపం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దీక్షకు దిగారు. అయితే ఈ దీక్షకు అనుమతి లేదని తొలుత పోలీసులు తెలిపారు. అయినప్పటికీ దీక్ష చేపట్టడంతో పోలీసులు, బండి సంజయ్‌ మధ్య కాసేపు చర్చలు జరిగాయి. అనంతరం పోలీసులు కాస్త వెనక్కి తగ్గడంతో సంజయ్‌ దీక్ష కొనసాగించారు. అనంతరం దీక్ష ముగించే సమయంలో టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయానికి వెళ్తామని సంజయ్‌  ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గన్‌పార్కు నుంచి టీఎస్‌పీఎస్‌సీ బయలుదేరిన బీజేపీ నేతలను బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మద్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తర్వాత బండి సంజయ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పోలీసులు అరెస్టు చేసి వాహనంలో తరలించారు.  

 

 

 

 

Tags :