సంపన్నులకు జో బైడెన్ షాక్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ దేశ బడ్జెట్ను ప్రతిపాదించారు. 2024 ఆర్థిక సంవత్సరానికిగాను ఫెడరల్ ప్రభుత్వానికి సంబంధించి అందులో 6.9 లక్షల కోట్ల డాలర్ల వ్యయ ప్రతిపాదనలు చేశారు. రాబోయే దశాబ్ద కాలంలో ద్రవ్య లోటును 2.9 లక్షల కోట్ల డాలర్ల మేర తగ్గించే ప్రణాళికలను పొందుపరిచారు. తాజా బడ్జెట్లోని ప్రతిపాదనల ప్రకారం దేశంలోని సంపన్నులపై పన్నుల భారాన్ని ప్రభుత్వం పెంచనుంది. 10 కోట్ల డాలర్లకు పైగా వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులపై కొత్త పన్ను విధించనుంది. ఏడాదికి 4 లక్షల డాలర్లకు పైగా ఆదాయం ఉన్న పౌరులు చెల్లించే పన్నులను తగ్గిస్తూ 2017 లో అప్పటి ట్రంప్ ప్రభుత్వం కల్పించిన ఉపశమనాలను ప్రస్తుతం బైడెన్ ప్రభుత్వం వెనక్కి తీసుకోనుంది. అమెరికా ప్రతినిధుల సభలో ప్రస్తుతం రిపబ్లికన్లదే మెజార్టీ. వారు బైడెన్ బడ్జెట్ ప్రతిపాదనలను ఎంతమేరకు ఆమోదిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.