ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత దీక్ష

మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో చేపట్టిన నిరాహార దీక్ష విజయవంతం అయింది. ఎమ్మెల్సీ కవితకు ఎంపీ కే కేశవరావు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఇది ఒక్క రాష్ట్రానికి సంబందించిన సమస్య కాదని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం మా పోరాటం కొనసాగుతోంది. మహిళా రిజర్వేషన్ సాధించే వరకు విశ్రమించేది లేదు. మోదీ ప్రభుత్వం తలచుకుంటే ఈ బిల్లు పాసవుతుంది. డిసెంబర్లో పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు పోరాడుతూనే ఉంటాము. రాష్ట్రపతికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ప్రారంభించిన ఈ పోరాటం ఇంకా ఉధృతమవుతుంది. మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరం సాధించి తీరాలి అని కవిత స్పష్టం చేశారు.
Tags :