MKOne TeluguTimes-Youtube-Channel

పోలవరం ప్రాజెక్టు పై కేంద్రం మరో బాంబు

పోలవరం ప్రాజెక్టు పై కేంద్రం మరో బాంబు

పోలవరం ప్రాజెక్టు పై కేంద్రం మరో బాంబు పేల్చింది.  పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతున్నందున  నిర్వాసిత కుటుంబాలకు కేంద్రమే నేరుగా నగదు బదిలీ చేయడం కుదరదని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ తేల్చి చెప్పింది. ఈ విషయంలో  రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి కేంద్ర్ర  ప్రభుత్వ ఆమోదానికి అనుగుణంగా లేదని తెలిపింది.  లోక్‌సభలో వైసీపీ ఎంపీ వంగా గీతా అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షికావత్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం చేసిన ఖర్చును  ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తున్నామని షెకావత్‌ పేర్కొన్నారు. భూసేకరణ, పునరావసంపై రాష్ట్రం చేసిన ఖర్చుల చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగడం లేదని ఆయన తెలిపారు. భూసేకరణ కింద 2014 ఏప్రిల్‌ నుంచి 2022 డిసెంబర్‌ వరకు రూ.3,779.05 కోట్ల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. వాటిలో రూ.3,431 .59 కోట్లు చెల్లించాం. సహాయ పునరావాస ప్యాకేజీ కింద 2014 ఏప్రిల్‌ నుంచి 2022 డిసెంబర్‌ వకు ఏపీ ప్రభుత్వం రూ.2,267.9 కోట్ల బిల్లులు సమర్పించగా, ఇప్పటి వరకు రూ.2,110 కోట్లు తిరిగి చెల్లించాం అని షెకావత్‌ పేర్కొన్నారు. 

 

 

Tags :