MKOne TeluguTimes-Youtube-Channel

సామాజిక ఆర్థిక సర్వే విడుదల చేసిన సీఎం జగన్

సామాజిక ఆర్థిక సర్వే విడుదల చేసిన సీఎం జగన్

శాసనసభలోని సీఎం చాంబర్‌లో 2022-23 సామాజిక ఆర్థిక సర్వేను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విడుదల చేశారు. అనంతరం ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రగతిలో ఏపీ నంబర్‌ వన్‌ అన్నారు. రూ.13.17 కోట్ల జీఎస్డీపీ నమోదైందన్నారు. గతంలో పోల్చితే రూ.1.18 లక్షల కోట్లు జీఎస్డీపీ పెరిగిందని తెలిపారు. వ్యవసాయంలో 13.18 శాతం, పరిశ్రమలలో 16.36 శాతం, సేవా రంగంలో 18.91 శాతం వృద్ధి నమోదైంది. 36 శాతం కంట్రీబ్యూషన్‌ వ్యవసాయం నుంచి వస్తోంది. అన్ని రంగాల్లోనూ అభివృద్ది కనిపిస్తోంది. ఆలిండియా యావరేజ్‌ కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువ. ఏపీ అభివృద్ధి 16.2 శాతం నమోదైంది. విద్య, ఆరోగ్య రంగాల్లో అనూహ్య అభివృద్ధి సాధించాం. శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి అని తెలిపారు. 

 

 

Tags :