భారత్ కు ఇది సవాల్ గా మారింది .... హెచ్చరించిన అమెరికా

జిబౌతీలో చైనా ఏర్పాటు చేసిన మిలిటరీ బేస్లో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లను, భారీ యుద్ధనౌకలను డ్రాగన్ దేశం మోహరించే అవకాశం ఉన్నదని అమెరికా రక్షణ శాఖ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. భారత్ నేవీకి ఇది సవాలుగా మారనున్నదని తెలిపింది. ఈ నివేదిక తాజాగా అమెరికా కాంగ్రెస్కు సమర్పించింది. జిబౌతీ లోని బేస్తో పాటు అదనపు మిలిటరీ లాజిస్టిక్స్ వసతుల ఏర్పాటుకూ చైనా పరిశీలిస్తున్నదని పేర్కొన్నది. దక్షిణ చైనా సముద్రంలో ఇప్పటికే అక్రమంగా నిర్మిస్తున్న కృత్రిమ దీవులకు తోడు ఇండియా పసిఫిక్ ప్రాంతంలో తన మిలిటరీ సామర్థ్యాన్ని మరింత విస్తరించే పనిలో చైనా ఉన్నదని వెల్లడిరచింది.
Tags :