ఈ నెల 22న ఉగాది వేడుకలు : సీఎస్ శాంతికుమారి

ఉగాది వేడుకల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 22న రవీంద్ర భారతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉగాది వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని కవి సమ్మేళనం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇందుకోసం సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, అధికారులు పాల్గొన్నారు.
Tags :