మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు... వచ్చే ఎన్నికల్లో తనకు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోవచ్చని అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మార్కెట్ యార్డు చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ రాకపోవచ్చు. నా భార్య సచీదేవికి టికెట్ ఇస్తారేమో? నీకు సీటు లేదు. నీ భార్యకు ఇస్తామని సీఎం జగన్ అంటే నేనైనా చేసేదేమీ లేదు. ఈసారి మహిళలే అని తేల్చి చెబితే నేనైనా పోటీ నుంచి వైదొలగాల్సిందే. నియోజకవర్గ స్థాయి నేతలు విభేదాలు పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పని చేయాలి. జిల్లాలోని కొండేపి వైసీపీ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు పార్టీ కార్యకర్తలు, నాయకులను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వేదిక మీదుగా చెబుతున్నా పార్టీ గెలుపు కోసం అందరితో నడవాలి. 2019లో కొండేపి నియోజకవర్గంలో వైసీపీ ఓటమిని చవిచూసింది. ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లో గెలిచి తీరాలి. వైసీపీ జెండా ఎగురవేయాలి అని పిలుపునిచ్చారు.