శంషాబాద్ విమానాశ్రయంలో ప్రవాసి సహాయతా కేంద్రం

విదేశాలకు ముఖ్యంగా కువైట్, ఖతార్లకు వెళ్ళే వలస కార్మికుల కోసం 24 గంటలు పని చేసే ప్రవాసి సహాయతా కేంద్రం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. జీఎమ్మార్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టమ్కమ్) భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణి కుముదిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విమానాశ్రయ సీఈవో ప్రదీప్ పణికర్ ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఈ కేంద్రం సురక్షితమైన, చట్టపరమైన ప్రవాసం గురించి అవగాహన పెంచడానికి గృహ కార్మికులు, నిర్మాణ రంగ కార్మికులు వంటి వారికి సరైన పత్రాలు, ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కోసం అవసరమైన పత్రాల విషయంలో సహాయపడనుంది. అంతర్జాతీయ డిపార్చర్ టెర్మినల్ వద్ద అందుబాటులో ఉండే ఈ సహాయతా కేంద్రం 24 గంటలు పని చేయనుంది.
Tags :