MKOne Telugu Times Youtube Channel

ప్రతిపక్షాలకు మళ్లీ నిరాశ...

ప్రతిపక్షాలకు మళ్లీ నిరాశ...

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థి దొరకక ప్రతిపక్షాలు తల పట్టుకుంటున్నాయి. తాము ఎన్నికల్లో పోటీ చేయలేమని ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, జమ్మూ కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా తేల్చి చెప్పిన సంగతి విదితమే. తాజాగా మహాత్మా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు. దీనితో ప్రతిపక్షాలు అనుకున్న ముగ్గురు వ్యక్తులు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు అయింది.

 

Tags :