మీ సలహాలొద్దు.. ఏం చేయాలో మాకు తెలుసు

ఉక్రెయిన్ వ్యవహారంలో మేం ఏం చేయాలో మీరు చెప్పన్కర్లేదు. ఏం చేయాలో మాకు తెలునంటూ నెదర్లాండ్స్కు భారత్ స్పష్టం చేసింది. ఐరాస భద్రత మండలి భేటీ సందర్భంగా నెదర్లాండ్స్ దౌత్యవేత్త చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. ఉక్రెయిన్ రష్యా సైనిక చర్య పేరుతో దాడి చేయడాన్ని తప్పుపడుతూ ఐరాస జనరల్ అసెంబ్లీ, మానవహక్కుల విభాగాల్లో ఓటింగ్ కోసం చేస్తున్న ప్రయత్నాలను భద్రతా మండలిలో సభ్యురాలైన ఇండియా అడ్డుకుంటోందని, యూఎన్ చాప్టర్ను గౌరవించి ఆ ప్రయత్నాలను విరమించుకోవాలంటూ యూకే, ఐర్లాండ్లలో నెదర్లాండ్స్ దౌత్యవేత్త కార్ల్ వాన్ ఊస్టెర్మ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి తిప్పికొట్టారు. ఉక్రెయన్, రష్యా యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరని, ప్రపంచంపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. దౌత్యమార్గాల్లో సమస్య పరిష్కరించుకోవాలని, భారత్ ఎప్పుడూ శాంతి పక్షమేనని పునరుద్ఘాటించారు. యుద్ధ క్షేత్రాల్లో చిక్కుకు పోయినవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తక్షణం మానవతా సాయం అందించానలి భారత్ కోరిన విషయాన్ని గుర్తు చేశారు.