MKOne TeluguTimes-Youtube-Channel

భారత్ తో కలిసి పని చేస్తాం : అమెరికా

భారత్ తో కలిసి పని చేస్తాం : అమెరికా

జీ20 సదస్సు ఆతిథ్య దేశంగా భారత్‌ ప్రత్యేకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అమెరికా అభిప్రాయపడింది. ఉక్రెయిన్‌తో యుద్దాన్ని ముగించడానికి రష్యాతో తనకున్న చిరాకాల సత్సంబంధాలను భారత్‌ వినియోగించుకోవాలని చెప్పింది. ఈ సంక్షోభాన్ని వీలైనంత త్వరగా ముగించడానికి తాము కూడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది.  జీ20 విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం ఉక్రెయిన్‌ యుద్ధంపై ఏకాభిప్రాయానికి రావడంతో విఫలమైన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ మీడియాతో మాట్లాడుతూ జీ20 సదస్సు ప్రారంభమయ్యే లోపు ఉక్రెయిన్‌ యుద్ధంపై ఒక పరిష్కార మార్గం దొరుకుతుందని  ఆశిస్తున్నట్టుగా తెలిపారు. ఇందుకోసం విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్‌ ఒక దారి చూపించిందని ఈ ఏడాది కాలంలో ఇంకా చేయాల్సింది చాలా ఉందని అన్నారు. 

 

 

Tags :