MKOne TeluguTimes-Youtube-Channel

వలస కూలీకి జాక్ పాట్.. రాత్రికి రాత్రే లక్షాధికారి!

వలస కూలీకి జాక్ పాట్.. రాత్రికి రాత్రే లక్షాధికారి!

ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకొని కేరళకు వచ్చిన వలసకూలీ ఎస్‌. కె.బాదేశ్‌కు జాక్‌పాట్‌ తగిలింది. రూ.75 లక్షలు లాటరీ తగిలి రాత్రికి రాత్రి లక్షాధికారి అయిపోయాడు. తన టికెటుకు లాటరీ తగిలిందన్న ఆనందం ఓవైపు ఆ టికెటును ఎవరైనా కాజేస్తారేమో అనే భయం ఇంకోవైపు వెంటాడింది. ఏం చేయాలో తోచక పోలీస్‌ స్టేషనుకు బాదేశ్‌ పరుగు తీశాడు. బెంగాల్‌కు చెందిన బాదేశ్‌ ఎర్నాకులంలోని చొట్టానికరలో రోడ్డు నిర్మాణపనుల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తరచూ లాటరీ టికెట్లు కొనే  అలవాటున్ను బాదేశ్‌, ఎప్పటిలాగే కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్త్రీ శక్తి లాటరీ వద్ద టికెట్‌ కొనుగోలు చేశారు. ఆ టికెట్‌పై రూ.75 లక్షల లాటరీ తగలడంతో అతడి ఆనందానికి హద్దులేవు. పోలీసులను ఆశ్రయించిన బాదేశ్‌ తన ప్రైజ్‌ మనీకి రక్షణ కల్పించాలని కోరాడు.

 

 

Tags :