రాజకీయ లబ్ధి కోసం.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంపై విమర్శలు

రాజకీయ లబ్ధి కోసం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిపై విమర్శలు చేయడం సరికాదని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. యాదాద్రిలో భక్తుల సౌకర్యాలపై దేవాదాయ శాఖ, అర్ అండ్ బీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. క్యూ కాంప్లెక్స్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడటం, వాష్ రూమ్స్లో పరిశుభ్రత, కొండపై చలువ పందిళ్ల ఏర్పాటు, ఇతర వసతుల ఏర్పాటై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా అకాల వర్షం వల్ల ఉత్పన్నమైన సమస్యలు, పునరుద్ధరణ చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దవి చేసి చూపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండపడ్డారు. సమస్యలు భవిష్యత్లో పునరావృతం కాకుండా వర్షాకాలంలో అధిగమించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మౌలిక వసతులపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. సామాన్య భక్తులకు శ్రీఘ్ర దర్శనం జరిగేలా చూడాలన్నారు. ఆలయం బయట భక్తులు సేద తీరేలా వసతి కల్పించాలని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో పెండిరగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్ఈ వసంత్ కుమార్, ఆలయ ఇంచార్జీ ఈవో రామకృష్ణ, ఇతర అధికారులు హాజరయ్యారు.