అమెరికాకు చెందిన కాల్అవే గోల్ఫ్ సంస్థను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సెంటర్లో అమెరికాకు చెందిన కాల్అవే గోల్ఫ్ సంస్థ కార్యాలయాన్ని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్లో కాల్అవే సంస్థ ఆఫీస్ ఏర్పాటవడం సంతోషంగా ఉందన్నారు. మౌలిక వసతుల్లో దేశంలోని ఇతర నగరాల కంటే హైదరబాద్ ముందున్నదని అన్నారు. నివాసయోగ్యమైన నగరాల్లోనూ హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణలో డిజిటెక్ కంపెనీలు చాలా ఉన్నాయని అన్నారు. శాండియాగోలో క్వాల్కం కేంద్ర కార్యాలయం ఉంది. సంస్థ తన రెండో పెద్ద కార్యాలయం హైదరాబాద్లో ఏర్పాటు చేసిందని వెల్లడిరచారు.
ఆపిల్, గూగుల్, ఉబర్, నోవార్టిస్ వంటి సంస్థలు నగరానికి వచ్చాయని తెలిపారు. ఆయా సంస్థల రెండో పెద్ద క్యాంపస్లు హైదరాబాద్లోనే ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అమెజాన్ అతిపెద్ద సెంటర్ నగరంలో ఉన్నదని తెలిపారు. కాల్అవే కూడా మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. కాల్అవే గోల్ఫ్ సంస్థ హైదరాబాద్లో రూ.150 కోట్లతో అతిపెద్ద డిజిటెక్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. దీని ద్వారా సుమారు 300 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.