అవగాహన లోపం వల్లే సైబర్ నేరాలు : మంత్రి కేటీఆర్

అవగాహన లోపం వల్లే సైబర్ నేరాలు జరుగుతున్నాయని, మోసపోతున్న వారిలో చదువుకున్న వారు, ఐటీ ఉద్యోగులు కూడా ఉండటం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సైబరాబాద్లో తెలంగాణ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ సైబర్ స్టేఫ్టీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం అంతా ఇంటర్నెట్తో సాగుతోంది. ప్రతి వస్తువు వైఫైతో పనిచేస్తోంది. ఇలాంటి సమయంలో సైబర్ భద్రత చాలా పెద్ద ఛాలెంజ్. సైబర్ మోసాల బారిన పడిన వాళ్లకు 1930 టోల్ఫ్రీ నంబరు అందుబాటులో ఉంది. కానీ ఈ విషయంలో ప్రజలకు చేరట్లేదు. సైబర్ నేరాలను అరికట్టడానికి తెలంగాణ పోలీసులు ఎన్నో చర్యలు తీసుకంటున్నారు. నేరాలను అరికట్టడానికి కేవలం పోలీసులే కాకుండా, ఇతర కంపెనీలు కూడా సామాజిక బాద్యత తీసుకోవాలన్నారు. హైదరాబాద్లో లక్ష మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. నేరాల బారిన పడుతున్న వారిలో చదువుకున్న వారు, ఐటీ ఉద్యోగులు ఉండటం బాధాకరం. సైబర్ నేరాలను అరికట్టేందుకే ప్రత్యేక చట్టాన్ని అమలు చేస్తాం. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితుల జాబితా రూపొందించాలి. ఓ ప్రత్యేక వెబ్సైట్ రూపొందించి అందులో నిందితుల జాబితా ఉంచాలి అని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.