ముడు నిమిషాల్లో మూడున్నర కిలోల పెరుగు తిని.. రికార్డ్

బీహార్ పాట్నాలో స్థానిక సుధా డైరీ గత పదేళ్లుగా పెరుగు తినే పోటీలు నిర్వహిస్తుంది. మూడు నిమిషాల్లో మూడున్నర కిలోలకు పైగా పెరుగు తిని విజేతగా నిలిచాడు. మహిళల, పురుషులు, సీనియర్ సిటిజన్ విభాగాల్లో సుమారు 500 మంది పోటీ పడ్డారు. పురుషుల విభాగంలో బార్హ్ ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ విజేతగా నిలిచాడు. ఆయన మూడు నిమిషాల్లో 3 కిలోల 420 గ్రాముల పెరుగు తిన్నాడు. మహిళల విభాగంలో పాట్నాకు చెందిన ప్రేమ తివారీ మొదటి స్థానంలో నిలిచింది. ఆమె 3 నిమిషాల్లో 2 కిలోల 718 గ్రాముల పెరుగు తిన్నారు. సీనియర్ సిటిజన్ విభాగంలో డిఫెండిరగ్ ఛాంపియన్ శంకర్ కాంత్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆయన మూడు నిమిషాల్లో 3 కిలోల 647 గ్రాముల పెరుగు తిని మొదటి బహుమతిని గెలుచుకున్నాడు. ఈ ముగ్గురూ దహీ శ్రీ టైటిల్ను సొంతం చేసుకున్నారు.
Tags :