ఆర్ఆర్ఆర్ బృందానికి ప్రధాని మోదీ అభినందనలు

ప్రతిష్టాత్మక అవార్డులతో దేశం ఉప్పొంగిపోయిందని, గర్విస్తోందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆర్ఆర్ఆర్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రాలు ఆస్కార్ అవార్డులు గెలవడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్, విస్పరర్స్ చిత్ర బృందాలను ప్రధాని అభినందించారు. ఆర్ఆర్ఆర్కు శుభాకాంక్షలు తెలుపుతూ అద్భుతం. నాటు నాటు ప్రజాదరణ విశ్వవ్యాప్తం. ఇది ఎన్నో ఏళ్లు గుర్తుండిపోయే పాట అవుతుంది. ఇంత ప్రతిష్టాత్మక గౌరవం అందుకున్న ఎంఎం కీరవాణి, చంద్రబోస్ మొత్తం చిత్ర బృందానికి నా అభినందనలు. భారతదేశం ఉప్పొంగింది. గర్విస్తోంది అని ప్రధాని అన్నారు. అలాగే విస్పరర్స్ బృందాన్ని కొనియాడారు. కార్తికి, గునీత్ మోంగా, ది ఎలిఫెంట్ విస్పరర్స్ బృందం మొత్తానికి నా అభినందనలు. ఈ చిత్రంలో సుస్థిర అభివృద్ధి ప్రకృతితో సామరస్యంగా జీవించాల్సిన ప్రాముఖ్యతను అద్భుతంగా హైలైట్ చేశారన్నారు.