మరో వివాదంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. తన భార్య అక్షతా మూర్తి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఓ పార్క్కు వెళ్లిన ఆయన అక్కడి నిబంధనలను ఉల్లంఘించారు. దీంతో పోలీసులు సునాక్కు నిబంధనలు గుర్తు చేయాల్సి వచ్చింది. సునాక్ కుటుంబం లండన్లోని హైడ్ పార్క్కు వ్యాహ్యాళికి వెళ్లినప్పుడు తమ పెంపుడు శునకం నోవా ను కూడా తీసుకెళ్లారు. అక్కడి సెర్పెంటైన్ సరస్సులో సమీపంలో నడుస్తున్నప్పుడు నోవాను స్వేచ్ఛగా వదిలేశారు. ఆ పార్క్లో కుక్కలకు బెల్టు కట్టకుండా తిప్పడం నిబంధలకు విరుద్ధం. ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంటూ అక్కడ సూచిక బోర్డు ఉన్నా సునాక్ కుటుంబం దాన్ని పాటించలేదు. దీన్ని గమనించిన సునాక్ భద్రత దళంలోని ఓ పోలీసు అధికారి ఆయనకు పార్కు నిబంధనల గురించి గుర్తు చేశారు. వెంటనే సునాక్ కుటుంబ సభ్యులు శునకానికి బెల్టు కట్టారు. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసులు స్పష్టం చేశారు.