ఏపీఎఫ్ డీసీ చైర్మన్ గా పోసాని బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పోసాని కృష్ణమూరళి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఈ బాధ్యతలు చేపట్టానని తెలిపారు. 11 ఏళ్లుగా నాకు సీఎం జగన్ తెలుసు. జనంలో నుంచి పుట్టిన నాయకుడు వైఎస్ జగన్. ఈ పదవితో సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేస్తానో తెలీదు కానీ, కీడు మాత్రం చేయను. కచ్చితంగా సీనీ ఇండస్ట్రీకి సేవ చేస్తా అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, లక్ష్మీ పార్వతి, చల్లా మధుసూధన్రెడ్డి, పైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
Tags :