MKOne Telugu Times Youtube Channel

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ కు తుది వీడ్కోలు

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ కు తుది వీడ్కోలు

క్వీన్‌ ఎలిజబెత్‌-2కు బ్రిటన్‌ తో పాటు ప్రపంచం యావత్తూ తుది వీడ్కోలు పలికింది. ప్రపంచ నేతలు, పలు దేశాల రాజులు, రాణులతో సహా దాదాపు 2 వేల మంది ప్రముఖుల సమక్షంలో లండన్‌లోని వెస్టుమినిస్టర్‌ అబ్బే చర్చి ఆవరణలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి. బ్రిటన్‌ దేశవ్యాప్తంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఊరేగింపు కార్యక్రమంలో ఛార్లెస్‌ కుమారులు విలియం, హ్యారీ, ప్రిన్సెస్‌ అన్నే, యవరాజులు ఆండ్రూ, ఎడ్వర్డ్‌, విలియం పిల్లలు ప్రిన్స్‌ జార్జి, ప్రిన్సెస్‌ చార్లెట్‌, రాజ వంశీయులు పాల్గొన్నారు. రాణి ఎలిజబెత్‌ అంత్యక్రియాల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :