వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు 12 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేల్లో బెందాళం అశోక్, కింజరావు అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవాని, నిమ్మకాయల చినరాజప్ప, గణబాబు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, నిమ్మల రామనాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామి ఉన్నారు. వీరిలో పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేవరకు, మిగిలిన వారిని ఈ ఒక్కరోజుకి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
Tags :