MKOne Telugu Times Youtube Channel

చెన్నై సముద్రతీరంలో భారత్ - అమెరికా నావికాదళ విన్యాసాలు

చెన్నై సముద్రతీరంలో భారత్ - అమెరికా నావికాదళ విన్యాసాలు

చెన్నై సముద్రతీరంలో భారత్‌-అమెరికా దేశాలకు చెందిన నావికాదళాలు సైనిక విన్యాసాలు చేశాయి. సోమవారం నాడు జరిగిన ఈ విన్యాసాలలో అమెరికా నావికాదళానికి చెందిన ‘మిడ్‌జెట్‌’ యుద్ధ నౌకను కూడా ప్రదర్శించారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ విన్యాసాల కోసం ఈ భారీ యుద్ధనౌక ఇటీవల చెన్నై హార్బర్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. చెన్నై సముద్రతీరంలో ‘అభ్యాస్‌-01/22’ పేరిట ఇరుదేశాల నావికాదళాలు సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. సరిహద్దులో తీవ్రవాదుల చొరబాట్లను అడ్డుకోవడం, ప్రమాదంలో ఉన్న వారిని రక్షించడం వంటి విన్యాసాలను రెండు దళాలు ప్రదర్శించాయి. ఈ పర్యటనలో భాగంగా అమెరికా-భారత్‌ నావికాదళ సిబ్బంది వాలీబాల్‌ కూడా ఆడినట్లు భారత నావికాదళం ఒక ప్రకటనలో తెలిపింది.

 

 

Tags :