MKOne TeluguTimes-Youtube-Channel

ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు : అమెరికా

ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు : అమెరికా

కరోనా నేపథ్యంలో చైనాపై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. కొవిడ్‌కు సంబంధించిన సమాచారాన్ని మిగతా దేశాలతో పంచుకోవడం లేదని తీవ్రంగా ఆక్షేపించింది. చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై అమెరికా ఆంక్షలను పెంచింది. జిన్‌పింగ్‌ ప్రభుత్వం కరోనా నిబంధనలను సడలించిన తర్వాత అక్కడ ఇన్‌ఫెక్షన్‌ నియంత్రణలో లేదని అమెరికా ఆరోపిస్తున్నది. బీజింగ్‌ నుంచి  తమకు ఎలాంటి సమాచారం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ  కారణంగా చైనా నుంచి వచ్చే ప్రయాణికులందరిపై ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేసింది. చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై భారత్‌, జపాన్‌, మలేషియా ఇప్పటికే పలు ఆంక్షలు విధించాయని అమెరికా అధికారులు తెలిపారు.  జనవరి 8 నుంచి ఇతర దేశాల నుంచి వచ్చే వ్యక్తులను నిర్బంధించాల్సిన అవసరాన్ని చైనా రద్దు చేసింది. దీంతో ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత పెరిగిపోయిందని అమెరికా ఆరోపిస్తున్నది.

 

 

Tags :