మంత్రి నిరంజన్ రెడ్డి కీలక ప్రకటన.. త్వరలోనే

రాష్ట్రంలోనే అన్నదాతలకు త్వరలోనే రైతుబంధు పెట్టుబడి సాయం జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని రైతుబంధు సమితి కార్యాలయంలో వ్యవసాయ శాఖ కాల్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ఆర్థిక, వ్యవసాయ శాఖలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గతంలో లాగే ఈ వానాకాలం కూడా సకాంలో సొమ్ము జమ చేస్తామని, రైతులెవరూ ఆందోళన పడవద్దని వెల్లడిరచారు. త్వరలోనే టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను రైతులకు వివరించేందుకు, రైతుల విజ్ఞప్తులు స్వీకరించడం కోసమే ఈ కాల్ సెంటర్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఇతర పథకాలకు సంబంధించి ఏ ఇతర వివరాల కోసమైనా కాల్ సెంటర్ ఉపయోగపడుతుందని అన్నారు.