రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం…కుమార్తె గాయత్రి మృతి
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. నటకిరీటీ రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో చనిపోయారు. శుక్రవారం రాత్రి కార్డియాక్ అరెస్టుతో హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో గాయత్రి కన్నుమూశారు. ఆమెకు తీవ్ర గ్యాస్ట్రిక్ సమస్య రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూనే ఆమె హార్ట్ ఎటాక్కు గురై కన్నుమూశారు.
రాజేంద్ర ప్రసాద్ కు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఈ విషయం తెలిసిన రాజేంద్రప్రసాద్ కుటుంబ సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీ, అభిమానులు ఆయనకు ధైర్యం చెబుతూ, ఆయన కుమార్తె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.
Tags :