గూగుల్తో అదానీ జట్టు
ఇండియాలో క్లీన్ ఎనర్జీపై అదానీ గ్రూప్ కంపెనీ అదానీ ఎనర్జీతో గూగుల్ జత కలిసింది. గుజరాత్లోని ఖవ్డాలో నిర్మించిన పునరుత్పాదక ఇంధన ప్లాంట్ నుంచి గూగుల్కు సరఫరా చేయనున్నట్లు అదానీ ఎనర్జీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్లాంట్ 2025 మూడో త్రైమాసికంలో ప్రారంభం కానుంది. అదానీ గ్రూప్ ప్రస్తుతం విండ్, సోలార్, హైబ్రీడ్ ఇంధన ఉత్పత్తి సమార్థ్యాలను సమకూర్చుకుంటోంది. వాణిజ్య, ఇండస్ట్రీయల్ సొల్యూషన్స్కు అదానీ గ్రూప్ పునరుత్పాదక ఇంధనాన్ని సరఫరా చేసేందుకు రెడీగా ఉందని ఈ ప్రకటనలో కంపెనీ తెలిపింది. గూగుల్ ప్రపంచ వ్యాప్తంగా తన కార్యకలాపాలను క్లీన్ ఎనర్జీని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే భారత్లో అదానీ కంపెనీతో ఒప్పందం చేఏసుకుంది.
Tags :