మరోసారి ఆ కాంబోని రిపీట్ చేస్తున్న తేజ్
సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కెరీర్లోనే పెద్ద హిట్ గా నిలిచిన విరూపాక్ష(Virupaksha) సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. గతేడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిందీ చిత్రం. అయితే ఇప్పుడు తేజు రోహిత్ కేపీ(Rohit KP) అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో 5 భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి బడ్జెట్ రూ.100 కోట్లు పైగానే ఖర్చు పెడుతున్నారంటున్నారు.
హను మాన్(Hanuman) సినిమాతో భారీ హిట్ అందుకున్న నిరంజన్ రెడ్డి(Nirajan Reddy) ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్(Prime Show Entertainments) బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు టెక్నీషియన్స్ ను కూడా పేరున్న వారినే తీసుకుంటున్నారని టాక్. కంగువ(Kanguva) లాంటి భారీ సినిమాలకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ వెట్రి పళనిస్వామి(Vetri palanaswami)ని ఈ సినిమాకు తీసుకున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ గా కన్నడలో బాగా డిమాండ్ ఉన్న అజనీష్ లోక్నాథ్(Ajanish Loknath)ను తీసుకున్నారు. తేజ్ నటించిన విరూపాక్షకు కూడా అతనే మ్యూజిక్ డైరెక్టర్. మంగళవారం(Mangalavaram) సినిమాకు కూడా మ్యూజిక్ అందించింది అజనీషే. మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు అజనీష్ సంగీతం బాగా ప్లస్ అవుతుంది. ఇప్పుడు తేజ్ చేస్తున్న సినిమా కూడా థ్రిల్లర్ మూవీ అనే సమాచారం. దీంతో తేజ్, అజనీష్ కాంబినేష్ మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తారని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. నెక్ట్స్ ఇయర్ సమ్మర్లో రిలీజ్ కానున్న ఈ సినిమాలో తేజ్ నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించనున్నాడు.