ఏపీ టిడ్కో చైర్మన్గా అజయ్ కుమార్ ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్గా వేములపాటి అజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ ఆర్టీసీ పరిపాలనా భవనంలోని తన ఛాంబర్లో ఆయన టిడ్కో చైర్మన్గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి తదితరులు తరలివచ్చిన అభినందనలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని అజయ్ కుమార్ తెలిపారు. మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వం లబ్దిదారుల పట్ల అమానవీయంగా వ్యహరించిందని ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో టిడ్కో లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందన్నారు.
Tags :