సీఎంగా వైఎస్ జగన్ ఎప్పుడైనా.. పరామర్శలకు వెళ్లారా? : ఆలపాటి
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడైనా వైఎస్ జగన్ పరామర్శలకు వెళ్లారా అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. జగన్ గుంటూరు పర్యటనపై రాజేంద్రప్రసాద్ స్పందించారు. తాడేపల్లి ప్యాలెజ్ పక్కనే జరిగిన అత్యాచారంపై కనీసం నోరు మెదపలేదన్నారు. అధికారంలోకి వచ్చాక మీ బాబాయి హత్య గురించి నోరు విప్పలేదు. నేరపూరిత ఆలోచనలతో జగన్ ఐదేళ్ల పాటు పరిపాలన చేశారు. దళితులు, మైనార్టీలు, బీసీలు హత్యకు గురైనప్పుడు ఎప్పుడైనా జగన్ పరామర్శించారా? పరామర్శల పేరుతో రాజకీయంగా మాపై బురద జల్లుతున్నారు. వరద బాధితులకు ఆయన ప్రకటించిన రూ.కోటి. సాయం ఎక్కడ ఇచ్చారు. మరి ఇప్పుడు ప్రకటించిన రూ.10 లక్షల సాయం జగన్ ఇస్తారా? సహానపై దాడి చేసిన నవీన్ తల్లి తమ కుటుంబం వైసీపీలోనే ఉన్నట్లు తెలిపారు. కానీ జగన్ మాత్రం నిందితుడు టీడీపీ వ్యక్తి అని అసత్యా ప్రచారం చేశారు. అరాచకాలు, మహిళలపై దాడులకు పాల్పడిన వారిని క్షమించము అని విరుచుకుపడ్డారు.