ధూమ్4 హీరో దొరికేశాడు!
ఇప్పుడంటే బాహుబలి(Baahubali), కెజిఎఫ్(KGF), కాంతారా(Kanthara) సీక్వెల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఓ సినిమాకు కొనసాగింపు సక్సెస్ఫుల్గా ఎలా చేయొచ్చో నిరూపించిన బ్లాక్ బస్టర్ మూవీ ధూమ్(Dhoom). ఈ సిరీస్ నుంచి 2004లో ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు ఆడియన్స్ ఆ కంటెంట్కి షాకయ్యారు. అందులో పేరుకే అభిషేక్ బచ్చన్(Abhishek Bhachan) హీరో కానీ విలన్ గా నటించిన జాన్ అబ్రహం(Jhan Abraham)కే ఎక్కువ పేరొచ్చింది.
దీంతో ధూమ్2(Dhoom2)లో కోరి మరీ విలన్ గా నటించాడు హృతిక్ రోషన్(Hrithik Roshan). అది అంచనాలకు మించి ఆడి కలెక్షన్ల వర్షం కురిపించింది. 2013లో వచ్చిన ధూమ్3(Dhoom3)లో అమీర్ ఖాన్(Amir Khan) డ్యూయల్ రోల్ చేయడమే కాకుండా పలు సాహసాలు చేసి ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచాడు. ధూమ్3 కమర్షియల్ గా వర్కవుట్ అయింది కానీ హైప్ పరంగా మాత్రం అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోయింది.
ఇదంతా జరిగి 11 ఏళ్లవుతోంది. ధూమ్4(Dhoom4) కోసం ఎంతో డిమాండ్ ఉంది కానీ ఇప్పటివరకు ఆ సినిమా స్క్రిప్ట్ రెడీ అవలేదు. ఇప్పుడు దానికి రూట్ క్లియర్ అయిందని టాక్. 2025లో ధూమ్4 షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇందులో మెయిన్ లీడ్ గా రణ్బీర్ కపూర్(Ranbir Kapoor) ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ధూమ్1, 2 సినిమాలకు కథలందించి ధూమ్3 కి దర్శకత్వం వహించిన విజయ్ కృష్ణ ఆచార్య(Vijay Krishna Acharya)తో కలిసి ఆదిత్య చోప్రా(Aditya Chopra) కథను ఓ కొలిక్కి తెచ్చారని, ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకు చూడని యాక్షన్ విజువల్స్ ను ఇందులో చూపించనున్నారట. అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా(Uday Chopra)లను మెయిన్ క్యాస్టింగ్ గా కొనసాగించనున్న ఈ సినిమాకు రూ.500 కోట్ల పైగానే ఖర్చు పెట్టనున్నారట.