ASBL Koncept Ambience
facebook whatsapp X

అమరావతిలోనే తొలి అడుగు...రెండు రోజులపాటు

అమరావతిలోనే తొలి అడుగు...రెండు రోజులపాటు

దేశాన్ని డ్రోన్‌ హబ్‌గా మార్చేందుకు తొలి అడుగు అమరావతి నుంచే పడనుంది. ఈ రంగంలో ఎదురయ్యే సవాళ్లు, భవిష్యత్‌ అవకాశాలు, రోడ్‌ మ్యాప్‌ గురించి నిపుణులు మేథోమథనం చేయనున్నారు. రెండు రోజులపాటు జాతీయ స్థాయిలో నిర్వహించనున్న అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌-2024 ఇందుకు వేదిక కానుంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో ప్రారంభం కానున్న సదస్సులో తొమ్మిది ప్యానల్‌ డిస్కషన్లు, 50 స్టాళ్లలో డ్రోన్ల ప్రదర్శన, రాష్ట్ర ముసాయిదా డ్రోన్‌ పాలసీ పత్రం ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.  డ్రోన్ల రంగంలో రాష్ట్రానికి దేశంలోనే మొదటి స్థానానికి చేర్చేందుకు ఈ సదస్సు తొలి అడుగుగా మారుతుందని భావిస్తున్న ప్రభుత్వం,  దీన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు ఢల్లీి మినహా దేశంలో మరెక్కడా జాతీయ డ్రోన్ల సదస్సు జరగలేదని అధికారులు పేర్కొంటున్నారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :