శ్రీవారి లడ్డుని కూడా వదలని వైసీపీ.. చంద్రబాబు సెన్సేషనల్ స్టేట్మెంట్..
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా తిరుమల శ్రీవారి లడ్డు గురించి సంచలన కామెంట్స్ చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి ప్రస్తావించిన ప్రతిసారి భక్తుల మదిలో మెదిలేది తీయని ఆయన ప్రసాదంగా అందించే లడ్డు. అలాంటి లడ్డు విషయంలో కూడా గత వైసీపీ ప్రభుత్వం అల్ప బుద్ధికి పాల్పడిందని.. వాళ్లు చేసిన నిర్వాకాలు అన్ని ఇన్ని కావు చంద్రబాబు అనడం సెన్సేషనల్ గా మారింది. తిరుమల శ్రీవారి లడ్డు గురించి ప్రస్తావించిన చంద్రబాబు కొన్ని విషయాలు తలుచుకుంటే మనసుకు ఎంతో బాధ కలుగుతుంది అని అన్నారు. తిరుమల లో ప్రసాదం తయారీకి విరివిగా కమ్మని నేతిని ఉపయోగిస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో కూడా కమిషన్ కొట్టడానికి పాల్పడిన వైసీపీ ప్రభుత్వం నేతి బదులు నాసిరకం పదార్థాలను ఉపయోగించారని చంద్రబాబు ఆరోపించారు.
భక్తులు పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి ఆఖరికి యానిమల్ ఫ్యాక్టర్ ను కూడా ఉపయోగించాలని ఆయన బాధపడ్డారు. చంద్రబాబు చెప్పిన ఈ మాటలు భక్తుల మదిలో బాంబులు పేలుస్తున్నాయి. ఆంధ్రకో.. లేక ఇండియాకో పరిమితం కాకుండా ప్రపంచ దేవుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాసుని సన్నిధిలో ఎటువంటివి జరగడం ఆయనకు అవమానమే అని చంద్రబాబు బాధపడ్డారు.
శ్రీవారి ఆలయంలో పవిత్రతను దెబ్బతీసే విధంగా ప్రసాదం తయారీలో ఎటువంటి నాణ్యత లేకుండా చేశారని.. అన్నదానంలో సైతం నాణ్యత లోపించిందని ఆయన ఫైర్ అయ్యారు. గతంలో శ్రీవారి లడ్డు, అన్న ప్రసాదంలో నాణ్యత లేదు అంటూ భక్తులు ఎందరో వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ మతం మనిషికి ఎంత మత్తెక్కిస్తుందో మనందరికీ తెలుసు.. పైగా వెంకటేశ్వర స్వామి గుడిలో ఇటువంటివి జరిగాయి అంటే ఆషామాషీ విషయం కాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతుంది.ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన ఈ కామెంట్స్ భక్తులలో ఎటువంటి రియాక్షన్ తీసుకువస్తుందో చూడాలి.