కేజీఎఫ్ హీరోయిన్కు మరో ఛాన్స్
![కేజీఎఫ్ హీరోయిన్కు మరో ఛాన్స్](https://www.telugutimes.net/storage/news/news_new_75368.jpg)
కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టికి ఆ సినిమా హిట్ తర్వాత వరుస పెట్టి అవకాశాలొస్తాయనుకుంటే సీన్ రివర్స్ అయింది. ఆఫర్లు రాకపోగా వచ్చిన ఒకే ఒక్క ఛాన్స్ విక్రమ్ కోబ్రా కూడా డిజాస్టర్ అయింది. దీంతో కన్నడ పరిశ్రమ అమ్మడుని పట్టించుకోవడం మానేసింది. కానీ శ్రీనిధికి తెలుగులో మాత్రం మెల్లిగా ఆఫర్లు వస్తున్నాయి.
నీరజ కోన దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో శ్రీనిధి నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుసు కదా అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీ ఖన్నాతో పాటూ శ్రీనిధి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. ఇద్దరు హీరోయిన్లున్నప్పటికీ అమ్మడి పాత్రకు మంచి ప్రాధాన్యత ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
దీంతో పాటూ ఇప్పుడు అమ్మడికి మరో ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. కిషోర్ అనే కొత్త దర్శకుడితో ఆర్కా మీడియా నిర్మిస్తున్నా రానా దగ్గుబాటి సరసన శ్రీనిధి శెట్టి నటించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందట. ఈ రెండు సినిమాలతో హిట్ కొడితే శ్రీనిధి టాలీవుడ్ లో సెటిలైపోవచ్చు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)