రాష్ట్ర చరిత్రలో ఇదొక రికార్డు : సీఎం చంద్రబాబు
![రాష్ట్ర చరిత్రలో ఇదొక రికార్డు : సీఎం చంద్రబాబు](https://www.telugutimes.net/storage/news/news_new_75340.jpg)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా వాడవాడలా పింఛన్ల సంబరం హోరెత్తింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీయే ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.7 వేల చొప్పున పింఛన్ను లబ్ధిదారులకు అందించింది. సామాజిక భద్రత పింఛన్ను ఇంత పెద్దమొత్తంలో అందించడం దేశ చరిత్రలో రికార్డు. గతనెల వరకు వారికి రూ.3 వేల చొప్పున అందుతుండగా, కొత్త ప్రభుత్వం ఒకేసారి రూ.1000 పెంచి, రూ.4 వేలు చేసింది. పైగా దాన్ని ఏప్రిల్ నుంచే అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించి, మూడు నెలల బకాయిలు కలిపి రూ.7 వేల చొప్పున అందించింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 18 రోజుల్లోనే కీలక హామీని నెరవేర్చింది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పింఛన్ల పంపిణీలో పాల్గొని లబ్ధిదారులకు నగదు అందించారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపరం నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ చేశారు. రాత్రి 10 గంటలకల్లా 95.05 శాతం ( 61.95 లక్షల మందికి) పంపిణీ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడిరచాయి. రాష్ట్ర చరిత్రలో ఇదొక రికార్డుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)