అమెరికాలో ఇచ్చాపురం యువకుడి మృతి
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా యువకుడు అక్కడ జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన పెదిని రూపక్రెడ్డి (26) 8 నెలల కిందట అమెరికా వెళ్లారు. డెలవేర్లో ఉంటూ హారిస్బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంఎస్ చదువుతున్నారు. రూపక్రెడ్డి, అతడి స్నేహితులు స్థానిక జార్జ్ లేక్కు వెళ్లారు. అక్కడ బోటుపై షికారు చేస్తూ సరస్సు మధ్యలో ఉన్న రాయిపై ఎక్కి ఫోటోలు దిగేందుకు రూపక్రెడ్డి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన పట్టుతప్పి నీటిలోకి జారిపోయారు. స్నేహితులు ప్రయత్నించినా కాపాడలేకపోయారని, రెస్క్యూ బృందం గాలించి మృతదేహాన్ని వెలికితీశారని కుటుంబ సభ్యులు తెలిపారు.
Tags :