ASBL NSL Infratech

తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య కీలక భేటీ ... అధికార యంత్రాంగం ఏర్పాట్లు

తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య  కీలక భేటీ ... అధికార యంత్రాంగం ఏర్పాట్లు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఈ నెల 6న హైదరాబాద్‌లో జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య కీలక భేటీకి అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. విభజన సమస్యలు పరిష్కరించుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు సీఎం రేవంత్‌ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సమావేశంలో చర్చించాల్సిన అజెండాను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఈ నెల 6న జరిగే సమావేశానికి ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించినట్లు సమాచారం. సమాచార మంత్రులు, ఉన్నతాధికారులతోనూ ఈ విషయమై సీఎం రేవంత్‌ రెడ్డి చర్చించనున్నారు.

పెండింగ్‌లో ఉన్న అంశాలివే....

పునర్విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్‌ లో ఉన్న ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంఘం తదితర 23 కార్పొరేషన్ల ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూల్‌లోని తెలుగు అకాడమీ, అంబేడ్కర్‌, తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థల ఆస్తులు, సేవలపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాజ్‌ భవన్‌, హైకోర్టు, లోకాయుక్త, కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నులు విద్యుత్‌ సంస్థల బకాయిలపైనా వివాదాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు చొరవతో రెండు రాష్ట్రాల మధ్య ఏళ్లు తరబడి పెండిరగులో ఉన్న విభజన సమస్యలు కొలిక్కి రావొచ్చని ఇరు రాష్ట్రాలు ఆశిస్తున్నాయి. 
 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :