ASBL Koncept Ambience
facebook whatsapp X

మొదటి రోజే 500 కోట్ల సేల్స్ సాధించిన ఏఎస్‌బీఎల్ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్

మొదటి రోజే 500 కోట్ల సేల్స్ సాధించిన ఏఎస్‌బీఎల్ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్

ఏఎస్‌బీఎల్ రియల్టర్ కంపెనీ ప్రాజెక్ట్ చేసిన రోజునే రికార్డు స్థాయిలో ఏకంగా 500 కోట్ల అమ్మకాలు నమోదు చేసింది. హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌ను ఏఎస్‌బీఎల్ లాంచ్ చేసింది. నగరంలో వేగంగా ఎదుగుతున్న రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సంస్థల్లో ఒకటైన ఏఎస్‌బీఎల్‌ ప్రారంభించిన ల్యాండ్‌మార్క్ ప్రాజెక్టుకు కొనుగోలు దారుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ ప్రాజెక్టు మొత్తం 6 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్టు లాంచ్ చేసిన మొదటి రోజునే 500 కోట్ల బిజినెస్ జరగడంపై ఏఎస్‌బీఎల్ వ్యవస్థాపకులు, సీఈవో అజితేష్ కొరుపోలు సంతోషం వ్యక్తం చేశారు. ‘సాధారణంగా ఉండే ఇళ్లు కాకుండా ఏఎస్‌బీఎల్ స్పెషాల్టీగా ఉండేలా స్టైల్, కంఫర్ట్, మోడర్నైజేషన్‌కు పెద్దపీట వేసి మేం ఈ నిర్మాణాలు చేస్తున్నాం. అర్బన్ కుటుంబాలకు అవసరమయ్యే అన్నీ వసతులు మా ప్రాజెక్టులో ఉంటాయి’ అని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులను తీసుకు వచ్చేందుకు ఏఎస్‌బీఎల్ కృషి చేస్తోంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :