ఏపీలో రైల్వే అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : కేంద్ర మంత్రి అశ్వినీ
ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్సభలో ఏపీలో రైల్వే ప్రాజెక్టులపై ఎంపీలు కేశినేని చిన్ని, సీఎం రమేశ్ ప్రశ్నలు అడిగారు. ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యమైన రాష్ట్రమని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంతో పోల్చితే కేటాయింపులు పెంచామని వెల్లడిరచారు. 2023`24 ఏడాదికి ఏపీకి రూ.8,406 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. అమరావతిలో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. అమరావతి, విజయవాడ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టనున్నట్లు వెల్లడిరచారు. విజయవాడ స్టేషన్ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అప్గ్రేడ్ చేస్తామన్నారు. అనకాపల్లి స్టేషన్ గురించి వివరాలు నివేదిక రూపంలో ఇస్తానని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడిరచారు.