ASBL Koncept Ambience
facebook whatsapp X

అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే : మంత్రి కోమటిరెడ్డి

అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే  : మంత్రి కోమటిరెడ్డి

ఎన్ని ఆటంకాలు ఎదురైనా మూసీ ప్రక్షాళన పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో  అసోచామ్‌ ఆధ్వర్యంలో అర్బన్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ సమిట్‌ కు ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ మూసీని సుందరీకరించి ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామన్నారు. మూసీకంటే ప్రమాదకరమైన సబర్మతిని మంచినీటి సరస్సుగా మార్చారని గుర్తు చేశారు. హైదరాబాద్‌ మహానగర జనాభా కోటిన్నర దాటిందని, నగరంలో నాలుగు మేయర్‌ స్థానాలు ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉందని తెలిపారు. అమెరికా తర్వాత అధిక బహుళజాతి కంపెనీలు హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. రీజినల్‌ రింగ్‌రోడ్డుతో హైదరాబాద్‌ రూపురేఖలు మారిపోతాయని, రెండు నెలలో టెండర్లు పిలుస్తామని తెలిపారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :