శాంతియుత మార్గంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని : మోదీ
శాంతియుత మార్గంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించుకోవాల్సి ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ దిశగా ఎలాంటి సహకారం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధమని చెప్పారు. రెండ్రోజుల పాటు జరిగే బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా లోని కజన్కు చేరుకున్న మోదీ, తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రాంతీయంగా శాంతి-సుస్థిరత సత్వరం నెలకొనేందుకు తాము పూర్తి మద్దతు ఇస్తామని, మానవత్వానికే తొలి ప్రాధాన్యమని చెప్పారు. మూడు నెలల్లోనే రెండోసారి తాను రష్యాకు రావడం ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన సమన్వయం, దృఢమైన విశ్వాసాలను ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. గత సంవత్సరం కొత్త సభ్యుల చేరికతో కూటమి బలోపేతమైందని తెలిపారు.
Tags :