వాళ్ల మాదిరిగా మేము ప్రవర్తించడం లేదు : భట్టి విక్రమార్క
బాధ్యతగల ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం బాధ కలిగించిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, అరెకపూడి గాంధీ వ్యవహారంపై భట్టి స్పందించారు. ఎమ్మెల్యేలు రోడ్డెక్కి కొట్లాడుతూ శాంతిభద్రతకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని గౌరవించాలని ఉపేక్షించాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ప్రతిపక్ష హోదా లేకుండా సీఎల్పీ సీటును సైతం గుంజుకున్నారు. వాళ్ల మాదిరిగా మేము ప్రవర్తించడం లేదు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు వినిపించాలని కోరుకుంటున్నా. ప్రతిపక్ష నేతలంటే మాకు గౌరవం ఉంది. అసెంబ్లీలో అధికార పార్టీ ఎవరో ప్రతిపక్ష పార్టీ ఎవరో స్పీకర్ వెల్లడిరచారు. శాంతిభద్రతలు కాపాడటం మా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత. బీజేపీ ఉనికి కోసం రాజకీయా డ్రామాలు ఆడుతోంది అని భట్టి విమర్శించారు.