రెండు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది : లక్ష్మణ్
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కోరారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం రెండు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. తిరుపతి పవిత్రను కాపాడాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. తిరుమలలో అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్పాలడిరదని ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కశ్మీర్ ప్రజలకు మోదీ రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిందని పేర్కొన్నారు. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేసిందన్నారు. మతపరమైన రిజర్వేషన్లను మాత్రమే బీజేపీ వ్యతిరేకించిందని తెలిపారు. రిజర్వేషన్లు రద్దు, రాజ్యాంగాన్ని మారుస్తామని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసి లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందిందని విమర్శించారు.