ASBL Koncept Ambience
facebook whatsapp X

ఎన్డీయే కూటమి విధానాలకు అనుకూలంగా.. ప్రజలు : పురందేశ్వరి

ఎన్డీయే కూటమి విధానాలకు అనుకూలంగా.. ప్రజలు : పురందేశ్వరి

వికసిత్‌ భారత్‌, ఆత్మనిర్భర్‌ భారత్‌కు ప్రజలు ఓటు వేశారని బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన బీజేపీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్డీయే కూటమి విధానాలకు అనుకూలంగా ప్రజలు ఓటు వేశారన్నారు. ఐదో ఆర్థికశక్తిగా భారత్‌ ఎదగడం వల్లే అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. దేశాభివృద్ధి కోసమే ప్రధాని నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ ఆలోచిస్తారని కేంద్ర మంత్రి మురుగన్‌ అన్నారు. మూడోసారి బాధ్యతలు చేపట్టాక పేదలకు 3 కోట్ల ఇళ్ల పథకంపై ప్రధాని మోదీ మొదటి సంతకం చేశారని చెప్పారు. రైతుల ఖాతాలకు రూ.20 వేల కోట్లను జమచేస్తూ రెండో సంతకం చేశారని గుర్తు చేశారు. పదేళ్ల ఎన్డీయే పాలనలో దేశం అద్భుత ప్రగతి సాధించిందని తెలిపారు.  కార్యక్రమంలో సోము వీర్రాజు తదితర నేతలు పాల్గొన్నారు. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :