ASBL NSL Infratech
facebook whatsapp X

సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్‌ చైర్మన్‌ భేటీ...

సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్‌ చైర్మన్‌ భేటీ...

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) ప్రతినిధులు భేటీ అయ్యారు. బీపీసీఎల్‌ చైర్మన్‌, ఎండీ కృష్ణకుమార్‌, సంస్థ ప్రతినిధులు ఆయన్ను కలిశారు. రాష్ట్రంలో పెట్రోల్‌ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చించారు. సుమారు రూ.60 వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటు అంశంపై ప్రభుత్వం, బీపీసీఎల్‌ మధ్య  సంప్రదింపులు జరిగినట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురితో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. మచిలీపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బీపీసీఎల్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :